విగ్రహంపై కేక్ కట్ చేసి వేడుకలు: 8 మంది మెడికోల సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-08-01T13:47:58+05:30 IST
చిదంబరం అన్నామలై విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు రాజా ముత్తయ్య చెట్టియార్ విగ్రహం తలపై కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న 8 మంది మెడికోలను సస్పెం
ఐసిఎఫ్(చెన్నై): చిదంబరం అన్నామలై విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు రాజా ముత్తయ్య చెట్టియార్ విగ్రహం తలపై కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న 8 మంది మెడికోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కడలూరు జిల్లా చిదంబరం అన్నామలై విశ్వవిద్యాలయంలో రెండవ వ్యవస్థాపకుడు రాజా ముత్తయ్య చెట్టియార్ విగ్రహం ఉంది. గురువారం రాత్రి దంత వైద్యకళాశాల జూనియర్ వైద్యులు కొందరు సహచర స్నేహితుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. విగ్రహంపై కేక్ ఉంచి కట్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. దీనిపై స్పందించిన వర్శిటీ అధికారులు ఆ 8 మంది మెడికోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, సస్పెండ్కు గురైన మెడికోలు, రాజా ముత్తయ్య చెట్టియార్ గురించి తమకు తెలియదని, ఈ తప్పుకు పాల్పడిన తమను క్షమించాలని వీడియో విడుదల చేశారు.