గణాంక దర్శిని 2020-21 ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-06-30T03:46:14+05:30 IST
జిల్లాలోని అన్నిశాఖల అధికారులు సమన్వయంతో జిల్లా గణాంకదర్శిని 2020-21 పుస్తకాన్ని రూపొందించినట్లు కలెక్టర్ రాహు ల్రాజ్ తెలిపారు. బుధవారం జాతీయ గణాంక దినో త్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో ముఖ్య ప్రణా ళికాధికారితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఆసిఫాబాద్, జూన్ 29: జిల్లాలోని అన్నిశాఖల అధికారులు సమన్వయంతో జిల్లా గణాంకదర్శిని 2020-21 పుస్తకాన్ని రూపొందించినట్లు కలెక్టర్ రాహు ల్రాజ్ తెలిపారు. బుధవారం జాతీయ గణాంక దినో త్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో ముఖ్య ప్రణా ళికాధికారితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పుస్తకంలో జిల్లా జనాభా, వాతావరణం, ఆరోగ్యం, నీటిపారుదల, విద్య, రోడ్డు రవాణా, కోర్టు, పోలీసు తదితర 20రకాల అంశాలను పొందుపరిచామన్నారు. ఈ పుస్తకం ద్వారా గణాంకాలు ఏవిధంగా రోజువారి జీవితంలో ఉపయో గపడుతాయో తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి రవీందర్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్లు శ్రీపాద, ఎస్ వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, గుర వయ్య, మండలప్రణాళికగణాంక అధికా రులు, ఫీల్డ్టెక్నిషియన్ రాజేష్ పాల్గొన్నారు.
విద్యార్థుల ప్రతిభ అభినందనీయం
ఆసిఫాబాద్ రూరల్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లావిద్యార్థుల ప్రతిభ అభి నందనీయమని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం ఆయన చాంబర్ లో ఇంటర్మీడియట్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులను అభి నందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టాప ర్గా నిలిచిన కాగజ్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి జెల్లఅమన్ను పుష్ప గుచ్ఛంతో సత్కరించారు. జిల్లాస్థాయిలో రెండోస్థానం లో నిలిచిన కాగజ్నగర్లోని వివేకానంద కళాశాలకు చెందినవిద్యార్థిని భావన, తృతీయస్థానంలో నిలిచిన ఆసిఫాబాద్ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థిని సాయిశ్రీతేజను కూడా సత్కరించారు. డీఐఈవో శ్రీధర్ సుమన్, ప్రిన్సిపాళ్లు ఖలీల్, హనోక్, అధ్యాపకులు పాల్గొన్నారు.