మరో 7 లక్షలకు పైగా కోవిడ్ డోసుల సరఫరా: కేంద్రం

ABN , First Publish Date - 2021-05-11T22:21:07+05:30 IST

మరో 7 లక్షలకు పైగా కోవిడ్ డోసుల సరఫరా: కేంద్రం

మరో 7 లక్షలకు పైగా కోవిడ్ డోసుల సరఫరా: కేంద్రం

న్యూఢిల్లీ: వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 7 లక్షలకు పైగా అదనపు కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసులను సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కేరళ, మహారాష్ట్రలతో సహా పలు రాష్ట్రాలు కోవిడ్ -19 వ్యాక్సిన్ల కొరతను నివేదించిన తరువాత  ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. అంతకుముందు 45 ఏళ్లు పైబడిన పౌరులకు టీకాలు వేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. మరో వైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు కరోనా నియంత్రణకు లాక్ డౌన్ ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి.

Updated Date - 2021-05-11T22:21:07+05:30 IST