రాష్ట్రంలో అరాచక పాలన
ABN , First Publish Date - 2022-05-23T06:53:03+05:30 IST
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ జడ్పీటీసీ సభ్యుడు కోమట్లపల్లి వెంకటసుబ్బారావు పేర్కొన్నారు. ఆదివారం పలుచోట్ల టీడీపీ నాయకలు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.
ఉండ్రాజవరం, మే 22: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ జడ్పీటీసీ సభ్యుడు కోమట్లపల్లి వెంకటసుబ్బారావు పేర్కొన్నారు. ఆదివారం పలుచోట్ల టీడీపీ నాయకలు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఉండ్రాజవరం మండలం సత్యవాడలో జరిగిన కార్యక్రమంలో వెంకటసుబ్బా రావు మాట్లాడుతూ నిత్యావసర ధరలు, పెట్రోలు, డీజిల్, నూనె ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో రోడ్లు నిర్మాణాలు, ఇతర అభివృద్ధిలేదన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలపై అప్పుల భారం మోపిన ఘనత సీఎం జగన్దేనన్నారు. అంబేద్కర్ విగ్రహానికి బాదుడే బాదుడుపై విడుదల చేసి కరపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బలుసు వెంకటరత్నం, నందిన శ్రీనివాస్, పాతూరి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.