జీపీఎఫ్‌ గోల్‌మాల్‌పై విచారణ చేయండి

ABN , First Publish Date - 2021-07-25T07:49:02+05:30 IST

రాష్ట్రంలోని మున్సిపల్‌ పాఠశాలల్లో టీచర్ల జీపీఫ్‌ నిధులు గోల్‌మాల్‌ అయ్యాయని, వాటిపై సమగ్రంగా న్యాయ విచారణ జరిపించాలని ఏపీ మున్సిపల్‌ టీచర్ల ఫెడరేషన్‌ అధ్యక్షుడు రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు

జీపీఎఫ్‌ గోల్‌మాల్‌పై విచారణ చేయండి

రాష్ట్ర మున్సిపల్‌ టీచర్ల ఫెడరేషన్‌


అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మున్సిపల్‌ పాఠశాలల్లో టీచర్ల జీపీఫ్‌ నిధులు గోల్‌మాల్‌ అయ్యాయని, వాటిపై సమగ్రంగా న్యాయ విచారణ జరిపించాలని ఏపీ మున్సిపల్‌ టీచర్ల ఫెడరేషన్‌ అధ్యక్షుడు రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొన్ని పట్టణ స్థానిక సంస్థల్లో టీచర్ల పీఎఫ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి ఆ మొత్తాన్ని కమిషనర్‌ అకౌంట్‌లో వేసుకుని, ఆ మొత్తాన్ని తిరిగి 7 శాతం వడ్డీతో కలిపి టీచర్లకు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. వీటి బకాయిలకు సంబంధించి లక్షలు దుర్వినియోగమయ్యాన్న ఆరోపణలున్నాయని తెలిపారు.   

Updated Date - 2021-07-25T07:49:02+05:30 IST