అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కృష్ణదాస్
ABN , First Publish Date - 2021-07-26T06:19:47+05:30 IST
వైసీపీలో జరు గుతున్న అభివృద్ధి గతంలో ఎన్నడూ చూడలేదని రాష్ట్ర ఉప ముఖ్యమం త్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖా మం త్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
తణుకు, జూలై 25: వైసీపీలో జరు గుతున్న అభివృద్ధి గతంలో ఎన్నడూ చూడలేదని రాష్ట్ర ఉప ముఖ్యమం త్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖా మం త్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆది వారం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ఆయన వేల్పూరు బహిరంగ సభలో మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగానే అమలు చేస్తున్నందునే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి బ్రహ్మ రథం పట్టారన్నారు. తణుకు స్టేషన్ రోడ్డులో 2.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, వేల్పూరులో సచివాలయం, బాలాజీ నగర్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. ఎమ్మెల్యే కారుమూరి, ఎమ్మెల్సీ మోషేన్ రాజు, పలు కార్పొరేషన్ల చైర్మెన్లు గుబ్బల తమ్మయ్య, వంక రవీంద్రనాద్, బోడపాటి వీర్రాజు, పీబీఆర్ ప్రసాదు, చిట్టూరి వెంకట సుబ్బారావు, ఎస్ఎస్రెడ్డి, ఆర్డీవో లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.