చుక్కల భూముల సమస్య పరిష్కరిస్తా
ABN , First Publish Date - 2022-06-30T03:54:27+05:30 IST
మూడు నెలల్లో చుక్కల భూముల సమస్యలు పరిష్కరిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు.
వైసీపీ ప్లీనరీలో మంత్రి కాకాణి
కావలిటౌన్, జూన్ 29: మూడు నెలల్లో చుక్కల భూముల సమస్యలు పరిష్కరిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్ఎస్సార్ కల్యాణ మండపంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన కావలి నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసీపీ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, టీడీపీ పాలనలో జరిగిన అబివృద్ధిపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎంపీ బీద మస్తాన్రావు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్చక్రవర్తి, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, కావలి ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్రెడ్డి తదితరులు మాట్లాడారు. నేతలు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, కనమర్లపూడి నారాయణ, ఎం రఽఘు, తాళ్లూరు ప్రసాద్నాయుడు, నియోజకవర్గంలోని పలువురు నేతలు తమ అభిప్రాయాలు వెల్లడించారు.