సమష్టిగా సాగితేనే 2024లో విజయం
ABN , First Publish Date - 2022-06-26T04:13:18+05:30 IST
నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తేనే 2024లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించగలమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
వెంకటాచలం, జూన్ 25: నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తేనే 2024లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించగలమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఓ కల్యాణ మండపంలో శనివారం సర్వేపల్లి నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో జిల్లా మొత్తం వైసీపీకి మద్దతుగా నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అదే పరిస్థితిని నిలబెట్టాలన్నారు. జిల్లాలో అన్ని స్థానాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి తిరిగి విజయాన్ని అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పరిశీలకులు సుకుమార్రెడ్డి, సుధీర్రెడ్డి, నాసిన భాస్కర్ గౌడ్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య, 5మండలాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.