రాష్ట్ర స్థాయి మహిళల క్యారమ్స్ ర్యాంకింగ్ టోర్నీ ప్రారంభం
ABN , First Publish Date - 2022-10-03T06:07:08+05:30 IST
ఆంధ్రప్రదేశ్, విశాఖ జిల్లా క్యారమ్ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న 50వ రాష్ట్ర స్థాయి మహిళల క్యారమ్స్ ర్యాంకింగ్ చాంపియన్షిప్ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది.
విశాఖపట్నం(స్పోర్ట్సు), అక్టోబరు 2: ఆంధ్రప్రదేశ్, విశాఖ జిల్లా క్యారమ్ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న 50వ రాష్ట్ర స్థాయి మహిళల క్యారమ్స్ ర్యాంకింగ్ చాంపియన్షిప్ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది. శివశివాని స్కూల్లో జరుగుతున్న ఈ పోటీలకు ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ రిఫరీ డాక్టర్ డీవీఎస్వై శర్మ ముఖ్య అతిఽథిగా హాజరై క్రీడాకారిణులకు జెర్సీ టీ షర్టులు పంపిణీ చేసి, మ్యాచ్లను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సంఘం అధ్యక్షుడు నీరజ్ సంపతీ మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 23 మంది ర్యాంకింగ్ క్రీడాకారిణులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది మహిళలను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నట్టు వివరించారు. ఎంపికైనవారు త్వరలో న్యూఢిల్లీలో జరిగే జాతీయ మహిళల క్యారమ్ చాంపియన్షిప్ టోర్నీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యారమ్ సంఘం ప్రతినిధులు ప్రీతి సంపతీ, ఐ.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.