రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో జిల్లా ఫస్ట్‌

ABN , First Publish Date - 2021-12-09T06:13:08+05:30 IST

వారధి ఫౌం డేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రఽథమ స్థానం లో నిలిచారని డీఈవో సీవీ రేణుక తెలిపారు.

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో జిల్లా ఫస్ట్‌
విజేతలను అభినందిస్తున్న డీఈవో రేణుక

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 8 : వారధి ఫౌం డేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రఽథమ స్థానం లో నిలిచారని డీఈవో సీవీ రేణుక తెలిపారు. కొవ్వూరు పాడు జడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని ఎం.కాత్యాయిని, ఏలూరు శర్వాణి పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థినులు పి.వెన్నెల, ఎస్‌.జాహ్నవి ముగ్గురు బృందానికి ప్రథమ స్థానం లభించిందన్నారు. విజేతలు ఒక్కొక్కరికి రూ.12 వేలు నగదు ప్రోత్సాహక బహుమతి, ప్రశంసా పత్రాలను ప్రభుత్వం అందజేసిందన్నారు. విజేతలను అభినందించిన వారిలో విద్యాశాఖ నోడల్‌ అధికారి వి.అరుణ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2021-12-09T06:13:08+05:30 IST