వచ్చే నెల 12న రాష్ట్ర స్థాయి డాక్ అదాలత్
ABN , First Publish Date - 2021-07-27T08:52:03+05:30 IST
వచ్చే నెల 12న రాష్ట్ర స్థాయి డాక్ అదాలత్ నిర్వహించనున్నట్టు పోస్టల్ సర్వీసుల విభాగం తెలిపింది.
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 12న రాష్ట్ర స్థాయి డాక్ అదాలత్ నిర్వహించనున్నట్టు పోస్టల్ సర్వీసుల విభాగం తెలిపింది. ఈ అదాలత్ వర్చువల్ పద్ధతిలో జరుగుతుందని, ప్రజలు సమస్యలు, ఫిర్యాదులను వచ్చే నెల 3లోగా ఎం.మన్మధ రావు, అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం, హైదరాబాద్ చిరునామాకు పంపించాలని సూచించింది.