రాష్ట్రస్థాయి స్నూకర్‌ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-27T04:40:41+05:30 IST

నగరంలోని బృందావనంలోని వీవీఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రస్థాయి బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ పోటీలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రస్థాయి స్నూకర్‌ పోటీలు ప్రారంభం
పోటీలను ప్రారంభిస్తున్న మలిరెడ్డి కోటారెడ్డి

నెల్లూరు(విద్య), మే 26 : నగరంలోని బృందావనంలోని వీవీఆర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రస్థాయి బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ రంజీ క్రికెటర్‌ మలిరెడ్డి కోటారెడ్డి, ఏపీ స్నూకర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కస్తూరి సోమేశ్వరరావు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నెల్లూరులో తొలిసారి ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు పోటీల నిర్వహణకు  అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు క్రీడాకారులకు వసతులు కల్పించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఇలాంటి పోటీలు మున్ముందు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. పలు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను అభినందించారు. స్పోర్ట్స్‌ అకాడమీ అధినేత ఎ.కృష్ణ మాట్లాడుతూ గ్రూప్స్‌, నాకౌట్‌ పద్ధతిలో ఈ పోటీలు జూన్‌ 2వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T04:40:41+05:30 IST