రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పిళ్లా మృతి

ABN , First Publish Date - 2021-05-06T09:02:22+05:30 IST

కాపునాడు వ్యవస్థాపకుడు, ఆ సామాజికవర్గానికి పెద్ద అయిన పిళ్లా వెంకటేశ్వరరావు కరోనాతో మృతిచెందారు. విజయవాడకు చెందిన ఆయన కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు

రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పిళ్లా మృతి

విజయవాడ, మే 5(ఆంధ్రజ్యోతి): కాపునాడు వ్యవస్థాపకుడు, ఆ సామాజికవర్గానికి పెద్ద అయిన పిళ్లా వెంకటేశ్వరరావు కరోనాతో మృతిచెందారు. విజయవాడకు చెందిన ఆయన కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. రాష్ట్రంలో కాపు సామాజికవర్గానికి పిళ్లా ఒక ప్రతినిధిలా వ్యవహరించారు. పిళ్లా వెంకటేశ్వరరావు మరణంపట్ల సీఎం జగన్మోహన్‌ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు  తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. కాపుల గళాన్ని అనుక్షణం ఆయన ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేవారిని చంద్రబాబు గుర్తుచేశారు. వెంకటేశ్వరరావు మృతికి అఖిల భారత కాపు సమాఖ్య ప్రతినిధులు దాసరి రాజామాస్టారు, యర్రగోవు నాగేశ్వరరావు, డేగల ప్రభాకర్‌, గలాబా సాంబశివరావు, మేకబాబూరావు, కస్తూరి వెంకటరమణ, శివరామ్‌, ఎద్దల రమేష్‌, అంచుల శ్రీను, శిఖా వాసు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-05-06T09:02:22+05:30 IST