ఉన్మాద పాలన
ABN , First Publish Date - 2020-02-20T10:06:40+05:30 IST
ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, తప్పుడు కేసులు బనాయించడం, పేదల కడుపు కొట్టడం వంటి చర్యలతో ముఖ్యమంత్రి జగన్ ఉన్మాద పాలన సాగిస్తున్నారని...
- పేదల కడుపు కొడుతున్నారు
- ప్రత్యర్థులపై తప్పుడు కేసులు
- ఆర్థిక మూలాలపై దాడులు
- స్థానిక ఎన్నికల్లో వైసీపీని
- చిత్తుచిత్తుగా ఓడించండి
- ‘వేదిక’ కూల్చిననాడే తిరగబడితే
- ఇంత బరితెగించేవారు కాదు
- జే-ట్యాక్స్ కడితేనే మంచి మద్యం
- ఇక జుట్టుకు, చొక్కాకూ పన్ను
- చైతన్య యాత్రలో బాబు ధ్వజం
ఒంగోలు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, తప్పుడు కేసులు బనాయించడం, పేదల కడుపు కొట్టడం వంటి చర్యలతో ముఖ్యమంత్రి జగన్ ఉన్మాద పాలన సాగిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆయన దూకుడు తగ్గాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపిచ్చారు. రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీడీపీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలను ప్రారంభించింది.
చంద్రబాబు దీనికి ప్రకాశం జిల్లాలో శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు బొప్పూడి నుంచి పర్యటన ప్రారంభించిన ఆయన మార్టూరు, మేదరమెట్ల, ఒంగోలులో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ వారు పోటీచేసేందుకు భయపడే విధంగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేశారని విమర్శించారు. ‘పేదల కడుపుకొట్టే విధంగా పింఛన్ల రద్దు, చంద్రన్న బీమాలాంటి ప్రజోపయోగ పథకాలకు ఫుల్స్టాప్ పెట్టారు. అమరావతిని చంపేశారు. పోలవరాన్ని ముందుకు సాగనివ్వడం లేదు. ప్రజలు చైతన్యవంతులై పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించకపోతే జగన్ ఉన్మాద చర్యలకు అడ్డూఅదుపూ లేకుండాపోతుంది’ అని సూచించారు.
‘అమరావతిలో ప్రజావేదిక కూల్చినప్పుడే జనం తిరగబడి రోడ్డుపైకి వచ్చి తీవ్ర నిరసన తెలిపి ఉంటే రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరిగేది కాదు. వైసీపీకి ఓట్లు వేసిన ప్రజలు ఈ 9నెలల పాలనపై మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి. వైసీపీకి చెందిన దొంగలు ఇసుక అమ్మకాల నుంచి అన్నింటిలోనూ దోపిడీకి పాల్పడుతున్నారు. సాక్షాత్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఇసుక అమ్ముకుంటున్నారు. పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి ఒక కాంట్రాక్టర్. ఆయన వ్యవహారశైలి చూస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు ఉంది. జె(జగన్)ట్యాక్స్ కడితేనే మంచి మద్యం మార్కెట్లోకి వస్తోంది. లేకపోతే నాసిరకం మద్యం ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారులపై రూ.1900 కోట్ల జరిమానా విధించారు. రాజకీయ కక్ష, జిల్లాపై కోపంతోనే టీడీపీకి చెం దిన శిద్దా రాఘవరావు, గొట్టిపాటి రవికుమార్లకు భారీ గా ఫైన్ వేశారు’ అని మండిపడ్డారు.
ఇంకా ఏమన్నారంటే.. నా జీవితం తెరిచిన పుస్తకం