అతిపెద్ద పార్టీగా బీజేపీ

ABN , First Publish Date - 2022-04-07T17:31:10+05:30 IST

అత్యధిక సభ్యత్వాలు కలిగి ఉండి.. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని బీజేపీ మధ్యప్రదేశ్‌

అతిపెద్ద పార్టీగా బీజేపీ

పార్టీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధర్‌రావు 

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం


హైదరాబాద్/కూకట్‌పల్లి: అత్యధిక సభ్యత్వాలు కలిగి ఉండి.. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని బీజేపీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి పి.మురళీధర్‌రావు అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం కూకట్‌పల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ.. ప్రజల అభ్యున్నతి కోసం బీజేపీ పనిచేస్తుందని, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిపల్లె, ప్రతి బూత్‌లో పార్టీ బలపడిందన్నారు. ఇందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించిందన్నారు. బీజేపీలో కష్టపడి పనిచేసే వారికి అత్యున్నత పదవులు దక్కుతాయన్నారు. అనంతరం పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు మాధవరం కాంతారావు, నాయినేని సూర్యప్రకాష్‌రావు, అర్శనపల్లి సూర్యారావు, కృష్ణగౌడ్‌, యంజాల పద్మ య్య, వినోద్‌, నాగరాజు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివేకానందనగర్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో బీజేపీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డా.కొరడాల నరేష్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలను ఆయన ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింగ్‌రావు, శ్రీనివాస్‌, వీరాచారి, కేశవులు, రాజు, మణిభూషన్‌, యాదగిరి, మమత, జయశ్రీ పాల్గొన్నారు. 

 బాలాజీనగర్‌ డివిజన్‌లో జరిగిన వేడుకల్లో బీజేవైఎం మేడ్చల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పృధ్వీరాజ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బాలాజీనగర్‌, కేపీహెచ్‌బీకాలనీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైకు ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున్న పాల్గొన్నారు. 

అల్లాపూర్‌: బీజేపీ మేడ్చల్‌ జిల్లా(అర్బన్‌) మహిళా కార్యదర్శి పులిగొల్ల శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో అల్లాపూర్‌లో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. రాబోవు ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కృషి చేస్తామని కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మేడ్చల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పులిగొల్ల శ్రీనివాస్‌ యాదవ్‌, అల్లాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు విజయ్‌, సదర్శన్‌ ముదిరాజ్‌, హరికృష్ణ, మోహన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


శేరిలింగంపల్లి నియోజకవర్గంలో

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. మియాపూర్‌లోని న్యూకాలనీ, బస్టాప్‌ వద్ద బీజేపీ సీనియర్‌ నాయకులు మొవ్వా సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కొండాపూర్‌ డివిజన్‌, గచ్చిబౌలి డివిజన్‌లో పార్టీ సీనియర్‌ నాయకుడు రవికుమార్‌యాదవ్‌, కార్పొరేటర్‌ గంగాధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. గచ్చిబౌలి నానక్‌రాంగూడలో కార్పొరేటర్‌ గంగాధర్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి, స్వీట్లు పంచారు. చందానగర్‌లోని పాపిరెడ్డికాలనీ, చందానగర్‌ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యోగానంద్‌, పార్టీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి, తారానగర్‌లో బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-07T17:31:10+05:30 IST