అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం : బీజేపీ

ABN , First Publish Date - 2020-11-25T05:02:25+05:30 IST

రాష్ట్ర భ్రుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజు అన్నారు. మంగళవారం స్థానిక బీఎస్‌ జేఆర్‌ కళాశాల ప్రాంగణంలో టెక్కలి నియోజకవర్గ బీజేపీ శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం : బీజేపీ
మాట్లాడుతున్న విష్ణుకుమార్‌రాజు

టెక్కలి : రాష్ట్ర భ్రుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని  మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజు అన్నారు. మంగళవారం స్థానిక బీఎస్‌ జేఆర్‌ కళాశాల ప్రాంగణంలో టెక్కలి నియోజకవర్గ బీజేపీ శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, కొర్ల కన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఫ నందిగాం : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు దృష్టికి నందిగాం మండల సమస్యల్ని తీసుకువెళ్లినట్లు ఆ పార్టీ నాయకులు అట్టాడ రాజేష్‌ తెలిపారు. టెక్కలిలో జరుగుతున్న శిక్షణ తరగతుల్లో పాల్గొని ఆయన్ని కలిసినట్టు చెప్పారు. కె.అచ్చెన్నాయుడు, కె.జగన్నాథం, వై.కామరాజు తదితరులు ఉన్నారు.

 

Updated Date - 2020-11-25T05:02:25+05:30 IST