రాష్ట్ర విభజన, కొవిడ్తో ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది: సజ్జల
ABN , First Publish Date - 2022-02-13T01:46:00+05:30 IST
రాష్ట్ర విభజన, కొవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుంగిపోయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
తిరుమల: రాష్ట్ర విభజన, కొవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుంగిపోయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ విభజన తర్వాత తొలిసారిగా సీఎం జగన్ చర్యలతో రాష్ట్రం సరైన దిశలో ముందుకు వెళుతోందన్నారు. రాష్ర్టానికి ఆర్థిక పరమైన ఇబ్బంది మాత్రమే ఉందన్నారు. ఆర్థిక వెసులుబాటు దొరికితే అన్ని రంగాల్లో ఏపీ ఎక్కడికో వెళుతుందన్నారు. ఏపీ విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించి, విభజన హామీలను నెరవేర్చాలని శ్రీవారిని ప్రార్థించినట్టు రామకృష్ణారెడ్డి తెలిపారు.