మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి : వైసీపీ

ABN , First Publish Date - 2020-08-04T11:28:33+05:30 IST

మూడు రాజధానులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నా రని ..

మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి : వైసీపీ

నిడదవోలు/ఆచంట/కాళ్ళ/పెంటపాడు, ఆగస్టు 3 : మూడు రాజధానులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నా రని వైసీపీ పట్టణాధ్యక్షుడు మద్దిపాటి ఫణీంద్ర అన్నారు. సోమవారం నిడద వోలులోని వడ్డీల వీధిలో బీసీ సెల్‌ అధ్యక్షుడు కృపానందం ఆధ్వర్యంలో ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డి కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఆచంట మండలం వల్లూరు, వేమవరం, పెనుమంచిలి సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాళ్ళలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పెన్మెత్స గోపాలకృష్ణంరాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. పెంటపాడు మండలం ఆకుతీగ పాడులో వైసీపీ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Updated Date - 2020-08-04T11:28:33+05:30 IST