AP News: టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి: బొరగం శ్రీనివాసులు

ABN , First Publish Date - 2022-08-19T03:18:57+05:30 IST

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో టీడీపీ పోలవరం

AP News: టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి:  బొరగం శ్రీనివాసులు

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ (TDP) నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో టీడీపీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను వివరించారు. సంక్షేమ పథకాలు పేరుతో అధిక వడ్డీలకు  అప్పులు తెచ్చి, ఆ డబ్బు తిరిగి రాబట్టుకోవడం కోసం ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తున్నారని మండిపడ్డారు. నిత్యావసరాలు, విద్యుత్, బస్సు చార్జీలను పెంచేసి సామాన్యుడి బతుకు భారంగా మారుస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుతూ కరపత్రాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వాడపల్లి నాగార్జున, మార్కెట్ కమిటీ మాజీ  చైర్మన్ పారేపల్లి రామారావు,  ప్రధాన కార్యదర్శి కర్రి రాంబాబు, పార్టీ  గ్రామాధ్యక్షులు నిమ్మగడ్డ రాంబాబు, సెక్రెటరీ బుయ్యా వెంకటేష్, మాజీ ఎంపీటీసీ గణేష్, సర్వేశ్వరరావు, కపాలి లిలాకాంత్, యాగంటి శివకృష్ణ,  ప్రగడ అంజిబాబు, కోడేల్లి వెంకటేష్, బొమ్మా శ్రీను,  టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధికార ప్రతినిధి పారేపల్లి పవన్,  తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు ఆకుల అరుణ, ఉపాధ్యక్షురాలు కాకి లక్ష్మి, కార్యదర్శి పెండ్యాల రమాదేవి, తెలుగు యువత మండల అధ్యక్షుడు శివంగి సుమంత్, టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు టీ రాకేష్ చందన్, ఐటీడీపీ ఎన్ చందు, విప్పే చందు, కూనపం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2022-08-19T03:18:57+05:30 IST