టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి

ABN , First Publish Date - 2022-08-19T05:08:09+05:30 IST

టీడీపీతోనే ఆంధ్రప్రదేశ అభివృద్ధి చెందుతుందని వల్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి అన్నారు.

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి
ప్రజలతో మాట్లాడుతున్న నాయకులు

వల్లూరు, ఆగస్టు 18 : టీడీపీతోనే ఆంధ్రప్రదేశ అభివృద్ధి చెందుతుందని వల్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని గూడూరు గ్రామంలో టీడీపీ ఉపాధ్యక్షుడు కమలాపురం నియోజకవర్గ ఇనచార్జ్‌ పుత్తా నరసింహాడ్డి ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారుద మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదన్నారు. విద్యుత ధరలను పెంచి ఆ భారాన్ని ప్రజలపై మోపారన్నారు. సమగ్రాభివృద్ధి జరగాలంటే ఒక్క టీడీపీతోనే సాధ్యమన్నారు. మాజీ సర్పంచ రామసుబ్బారెడ్డి, తెలుగు యువత నాయకుడు సునీల్‌కుమార్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, వెంకటసుబ్బయ్య, రమణారెడ్డి, ఎం.సుబ్బారెడ్డి, ఎస్సీసెల్‌ నాయకులు శ్రీనివాసులు,  రమణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T05:08:09+05:30 IST