సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి: రవీంద్ర

ABN , First Publish Date - 2022-05-22T06:34:05+05:30 IST

సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం అన్ని రం గాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మె ల్యే రవీంద్రకుమార్‌ అన్నారు.

సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి: రవీంద్ర
పెండ్లిపాకలలో రైతువేదికను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రవీంద్ర

కొండమల్లేపల్లి, మే 21: సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం అన్ని రం గాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మె ల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండ ల పరిధిలోని గుడితం డా, పెండ్లిపాకల గ్రా మపంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. వాటర్‌ట్యాంక్‌, పల్లె ప్రకృతివనం, రైతువేదిక, ఈ పంచాయతీ, శ్మశానవాటిక, విద్యుత ట్రాన్సఫార్మర్లను ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణలోని చిన్న గ్రామాల ను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమం లో సహకార సంఘం చైర్మన వేణుధర్‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, రాంబాబు, నాయకులు దస్రునాయక్‌, శ్రీనివా్‌సయాదవ్‌, యుగేందర్‌రెడ్డి, కొండమల్లేపల్లి సర్పంచ శ్రీనివా్‌సగౌడ్‌, శ్రీనివా్‌సయాదవ్‌, ఎంపీటీసీ రజిత, సర్పంచ అనిత, శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T06:34:05+05:30 IST