చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
ABN , First Publish Date - 2022-08-17T05:49:11+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునా యుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్చార్జి గౌరు చరిత అన్నారు.
మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు
ఆగస్టు 16: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునా యుడుతోనే
రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్చార్జి గౌరు
చరిత అన్నారు. కల్లూరు అర్బన్ 27వ వార్డులోని కృష్ణనగర్, ఆదిత్యాన
గర్లలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కాలనీల్లో పర్య
టించి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి కరపత్రాలను
పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరుచరిత మాట్లాడుతూ ప్రజా సమస్యలు
పరిష్కరించడంలో, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైసీపీ ఘోరంగా విఫలమైందన్నారు.
ప్రతి ఏడాది ప్రభుత్వ సం క్షేమ పథకాలను కుదిస్తూ అర్హులైన పేదప్రజల
జీవితాలతో చెల గాట మాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ, కరెంటు
చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. కార్యక్ర మంలో 27వ
వార్డు ఇన్చార్జి క్యాతూరు మధు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు.