AP Minister: బౌన్సర్లు పెట్టుకుని రైతులు పాదయాత్ర చేయడం ఏంటి?
ABN , First Publish Date - 2022-09-14T18:29:27+05:30 IST
అమరావతి రైతుల పాదయాత్రపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: అమరావతి రైతుల పాదయాత్ర (Amaravati Farmers' Padayatra)పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ( Karumuri Nageswara Rao ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతినే లా ఒక ప్రాంత వాసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. బౌన్సర్లు పెట్టుకుని రైతులు పాదయాత్ర చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిజమైన రైతులు ఎలా ఉంటారో ప్రజలకు తెలుసన్నారు. తాను రైతు బిడ్డనే అని తెలిపారు. వ్యక్తిగతంగా మూడు రాజధానులనే కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ లాంటి చోట్ల పెట్టుబడులు పెట్టేసి అంతా కోల్పోయామని... మళ్ళీ అదే తప్పు ఎందుకు చేయడమని అన్నారు. అందుకే తమ ప్రభుత్వ (AP government) నిర్ణయం మూడు రాజధానులే అని మరోసారి స్పష్టం చేశారు. రైతులు పాదయాత్ర చేసినంత మాత్రాన మూడు రాజధానుల నిర్ణయం ఆగదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (AP Minister) తేల్చిచెప్పారు.