సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-07-06T10:22:23+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయ, ట్రిపుల్‌ఐటీ పర్యటనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

వేంపల్లె, జూలై 5:  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయ, ట్రిపుల్‌ఐటీ పర్యటనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 7,8 తేదీల్లో సీఎం పర్యటించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం ట్రిపుల్‌ఐటీలో అభివృ ద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.


రూ.90కోట్ల విలువైన 11 ల్యాబ్‌ కాంప్లెక్స్‌లను, మూడు మెగావాట్ల సోలార్‌ సిస్టంను ప్రారంభించనున్నారు. రూ. 40 కోట్లతో నిర్మించనున్న వైఎస్సార్‌ ఆడిటోరియం, క్యాంపస్‌ ఆవరణంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్‌, ఎస్పీలు పర్యటించి అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.

 

ఇడుపులపాయ, ట్రిపుల్‌ఐటీల్లో పర్యటించిన ఎస్పీ: సీఎం పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన భ ద్రతా చర్యలను ఎస్పీ అన్బురాజన్‌ పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ట్రిపుల్‌ఐటీని సం దర్శించారు. అక్కడ సీఎం పర్యటించే ప్రాంతాలను పర్యటించారు. తీసుకోవాల్సిన భద్రత చర్యల గురిం చి కిందిస్థాయి పోలీసులకు సూచించారు. భద్రత పకడ్బంధీగా ఉండాలని, పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 

Updated Date - 2020-07-06T10:22:23+05:30 IST