రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

ABN , First Publish Date - 2021-04-17T05:24:01+05:30 IST

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేశారు.

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

నంద్యాల(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 16:  రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేశారు. నంద్యాలలో ఏపీ రాష్ట్ర చెస్‌ సంఘం అడ్‌హక్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి చెస్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు, జిల్లా జట్టు ఎంపిక పోటీలు శుక్రవారంతో ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్‌ రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు మెమోంటోలు ప్రదానం చేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారుల పేర్లను పోటీల నిర్వాహక కార్యదర్శి రామసుబ్బారెడ్డి ప్రకటించారు. నిహాల్‌ స్వర్ణ, సునీల్‌కుమార్‌, నిఖిలేష్‌, దీపికలు కర్నూలు జిల్లా చెస్‌ జట్టుకు ఎంపికయ్యారు. ఎంపికైన వీరు ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు నెల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతినిధ్యం వహించనున్నట్లు డాక్టర్‌ రవికృష్ణ, రామసుబ్బారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-04-17T05:24:01+05:30 IST