అధ్యాపకుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ABN , First Publish Date - 2021-02-24T05:58:19+05:30 IST
కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
కొవ్వూరు, ఫిబ్రవరి 23: కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. సమావేశంలో కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్ పోస్టులు, 1 నాన్ టీచింగ్, 13 అవుట్ సోర్సింగ్ పోస్టులు మంజూరు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కళాశాలలో 2019 నుంచి ఇప్పటి వరకు డిప్యుటేషన్పై అధ్యాపకులు ఇతర కళాశాలల నుంచి వారానికి రెండు లేక మూడు రోజులు విధులు నిర్వహిస్తున్నారు. కేబినెట్ నిర్ణయంతో డిగ్రీ కళాశాలలో పూర్తిస్థాయిలో అద్యాపకుల పోస్టులు భర్తీకానున్నాయి.