జాతీయ బాక్సింగ్ టోర్నీకి రాష్ట్ర బాలబాలికల జట్లు
ABN , First Publish Date - 2022-05-20T05:39:34+05:30 IST
జాతీయ సబ్ జూనియర్ బాలబాలికల బాక్సింగ్ చాంపియన్షిప్ టోర్నీలో పాల్గొనే ఆంధ్ర జట్ల సభ్యుల జాబితాను గురువారం ప్రకటించారు.
ఈనెల 20 నుంచి కర్ణాటకలో టోర్నీ
విశాఖపట్నం (స్పోర్ట్సు), మే 19: జాతీయ సబ్ జూనియర్ బాలబాలికల బాక్సింగ్ చాంపియన్షిప్ టోర్నీలో పాల్గొనే ఆంధ్ర జట్ల సభ్యుల జాబితాను గురువారం ప్రకటించారు. కర్ణాటకలో ఈనెల 20 నుంచి జరిగే ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనేందుకు బాలుర, బాలికల విభాగాలలో 28 మందిని ఎంపిక చేశామని ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ సంఘం కార్యదర్శి బి.ఎ.లక్ష్మణ్దేవ్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పోర్టు స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వెంకటేశ్వరరావు, రాష్ట్ర బాక్సింగ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డి.రామకృష్ణ, టెక్నికల్ చైర్మన్ బి.నాగేశ్వరరావు పాల్గొని చిన్నారులను అభినందించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
బాలుర జట్టు
ఎ.గౌతమ్ సూర్యతేజ, ఎన్.గణేష్, సిహెచ్.ఎల్లా యశ్వంత్, పి.సుబ్రహ్మణ్యం, ఎ.గౌతమ్, డి.ప్రవీణ్కుమార్, జి.కిరణ్, కె.అజయ్, పి.మణికంఠ, బి.తేజ కృష్ణ, వి.జయరామ్, బి.హర్షవర్ధన్ యాదవ్, బి.ఈశ్వర్ చరణ్రెడ్డి, ఎస్.నూతన్ వెంకట చరణ్. ఈ జట్టుకు ఐ.భీమలింగేశ్వరరావు, ఎండీ.గౌష్, సుండీరావు కోచ్లుగా వ్యవహరిస్తారు.
బాలికల జట్టు
ఎల్.ఎల్.ఎల్.లాసిని, బి.అమృతవర్షిణి, ఎన్.అనుష్క, వి.తిరుమల, ఎస్.స్నేహ, ఎస్.పావని, ఎం.మేఘన, బి.సాయి సమీర, ఎ.నసీమా, కె.నిహారిక, ఎస్.మిహర, పి.హారతి, సబ తబసుమ్, ఎం.వి.ప్రజ్ఞశ్రీ. ఈ జట్టుకు ఎన్.అన్నపూర్ణ, జి.రమ్య, బి.ఎల్లాజీరావు కోచ్లుగా వ్యవహరిస్తారు.