రైల్వేస్టేషన్‌లో స్వాబ్‌ పరీక్షల ప్రారంభం

ABN , First Publish Date - 2020-06-07T06:33:56+05:30 IST

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి దిగుతున్న ప్రయాణికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం స్వాబ్‌ పరీక్షలు నిర్వహిస్తోంది.

రైల్వేస్టేషన్‌లో స్వాబ్‌ పరీక్షల ప్రారంభం

  • క్వారంటైన్‌కు అనుమానితుల తరలింపు

నెల్లూరు ( వెంకటేశ్వరపురం) జూన్‌ 6 : నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి దిగుతున్న ప్రయాణికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం స్వాబ్‌  పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో బెంగళూరు నుంచి దానాపూర్‌ వెళ్లే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు మాత్రమే స్టాపింగ్‌ ఇచ్చారు. ముందుగా ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహిస్తున్నారు. అందులో అనుమానిత లక్షణాలు ఉంటేనే స్యాబ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.  శనివారం దానాపూర్‌ నుంచి వచ్చిన సుమారు 10 మంది ప్రయాణికులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ స్వాబ్‌ పరీక్షలు నిర్వహించారు. అనుమానితులను నెల్లూరు క్వారంటైన్‌కు తరలించారు. ఫలితాలు  వచ్చాక వారిని ఇళ్లకు పంపించనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రమాదేవి, యస్వంత్‌కుమార్‌, శ్రీనివాసులు స్వాబ్‌ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో వైద్యులు సుధీర్‌, జయచంద్ర, మోహన్‌, రాజేష్‌, రైల్వే సూపరింటెండెంట్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-07T06:33:56+05:30 IST