ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-30T04:01:30+05:30 IST

మండలంలోని రవీంద్రనగర్‌ గ్రామంలో సహకార సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మాంతయ్య ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
చింతలమానేపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మాంతయ్య

చింతలమానేపల్లి, నవంబరు 29: మండలంలోని రవీంద్రనగర్‌ గ్రామంలో సహకార సంఘం ఆధ్వ ర్యంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మాంతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏవో రాజేష్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మహేష్‌, ఏఈఓ హెప్సిభా, అమీర్‌ హుస్సేన్‌, రైతులు పాల్గొన్నారు. 

కౌటాల: మండల కేంద్రంతో పాటు కుంబారి, రవీంద్రనగర్‌ గ్రామాల్లో సోమవారం డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాంతయ్య ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.కార్యక్రమంలో ఏవో రాజేష్‌, ఏఈవోలు రాజేష్‌, సెంటర్‌ ఇన్‌చార్జి తాజీం హుస్సేన్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T04:01:30+05:30 IST