Liberia చర్చిలో తొక్కిసలాట...29 మంది మృతి

ABN , First Publish Date - 2022-01-21T13:58:33+05:30 IST

లైబీరియాలోని ఓపెన్-ఎయిర్ పెంటెకోస్టల్ చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు మరణించారు...

Liberia చర్చిలో తొక్కిసలాట...29 మంది మృతి

మన్రోవియా: లైబీరియాలోని ఓపెన్-ఎయిర్ పెంటెకోస్టల్ చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు మరణించారు.లైబీరియా రాజధాని మన్రోవియాలో జరిగిన చర్చిలో  జరిగిన తొక్కిసలాటలో రాత్రికి రాత్రే 29 మంది మరణించినట్లు లైబీరియా డిప్యూటీ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి చెప్పారు.రాజధాని శివార్లలోని పొరుగున ఉన్న న్యూ క్రూ టౌన్‌లో రాత్రి జరిగిన క్రిస్టియన్ ఆరాధన కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగిందని జలవా టోన్‌పో చెప్పారు.ఈ తొక్కిసలాటలో 29 మంది మరణించారని, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారని వైద్యులు చెప్పారు. దోపిడీకి ప్రయత్నించిన గుంపును సాయుధ వ్యక్తుల బృందం వెంటాడటంతో తొక్కిసలాట ప్రారంభమైందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 


చర్చిలో పరుగెత్తుతున్నప్పుడు, కొంతమంది కింద పడిపోయారు. మరికొందరు నేలపై పడటంతో వారిపైనుంచి మరికొందరు నడిచారు.జోగోస్ అని పిలిచే లైబీరియన్ స్ట్రీట్ గ్యాంగ్‌ల బ్యాండ్‌లు కొడవళ్లు, ఇతర చిన్న ఆయుధాలతో దోపిడీలకు పాల్పడుతుంటాయి.ఈ ఘటనకు కారణమేమిటనే దానిపై వ్యాఖ్యానించేందుకు లైబీరియా దేశ పోలీసు ప్రతినిధి మోసెస్ కార్టర్ నిరాకరించారు.ఈ ఘటనపై విచారణ జరుగుతోందని మోసెస్ తెలిపారు.


Updated Date - 2022-01-21T13:58:33+05:30 IST