కొవిడ్‌ పరీక్షల కోసం పడిగాపులు

ABN , First Publish Date - 2021-05-06T06:23:01+05:30 IST

కొవిడ్‌ విజృంభిస్తున్న తరుణంలో టెస్టింగ్‌లు చేయించుకోవడానికి అనుమానితులు క్యూ కడుతున్నారు. హిందూపురంలో కొవిడ్‌ ఉదృతి కొనసాగుతోంది.

కొవిడ్‌ పరీక్షల కోసం పడిగాపులు
టెస్టింగ్‌ల కోసం గుమిగూడిన జనం


  ముందుగానే ఆధార్‌ కార్డులతో క్యూ  

  హిందూపురం టౌన్‌, మే 5: కొవిడ్‌ విజృంభిస్తున్న తరుణంలో టెస్టింగ్‌లు చేయించుకోవడానికి అనుమానితులు క్యూ కడుతున్నారు. హిందూపురంలో కొవిడ్‌ ఉదృతి కొనసాగుతోంది. టెస్ట్‌ల కోసం ఆసుపత్రులకు జనం పోటెత్తుతున్నారు. అంతేకాక గత మూడు రోజులుగా టెస్టింగ్‌ కిట్‌లు లేక పరీక్షలు నిలిపారు. దీంతో బుధవారం ఎంజీఎం పాఠశాలలో టెస్ట్‌లు ప్రారంభించారు. పట్టణంలో కొవిడ్‌ లక్షణాలున్న అనుమానితులు అధికంగా ఉండటంతో టెస్ట్‌లు చేయించుకోవడానికి పరుగులుతీస్తున్నారు. కొవిడ్‌ టెస్టింగ్‌కు చాలా మంది క్యూలో నిలబడ లేక ఆధార్‌కార్డులను క్యూలో ఉంచి చెట్లకింద నిరీక్షించారు. దీన్నిబట్టి చూస్తే అక్కడ వస్తున్నవారికి వెంటనే టెస్ట్‌లు చేయకపోవడంతో అలసిపోతున్నారు. అంతేకాక టెస్టింగ్‌ కేంద్రం వద్ద కనీసం నీరు, నీడ సౌకర్యం లేకపోవడంతో ఎండవేడిమికి తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ పరిస్థితి చూస్తే ప్రాణానికి పరీక్షలా ఉంది. 


Updated Date - 2021-05-06T06:23:01+05:30 IST