డంపింగ్ యార్డ్లో మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది
ABN , First Publish Date - 2021-06-14T05:07:48+05:30 IST
కొర్రపాడు రోడ్డు లో వున్న మున్సిపల్ డంపింగ్ యార్డ్లో మంటల ను ఆదివారం మున్సిపల్ ఫైర్ సిబ్బంది ఆర్పివేశా రు.
ప్రొద్దుటూరు అర్బన్, జూన్ 13 : కొర్రపాడు రోడ్డు లో వున్న మున్సిపల్ డంపింగ్ యార్డ్లో మంటల ను ఆదివారం మున్సిపల్ ఫైర్ సిబ్బంది ఆర్పివేశా రు. ‘డంపింగ్ యార్డులో మంటలు విద్యుత్ సబ్ స్టేషన్ను కమ్మేసిన పొగలు’ అనే శీర్షికన ఆదివా రం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఇందు కు స్పందించిన కమిషనర్ రాధ, డీఈ అబిద్ శాని టరీ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డితో కలిసి ఉదయం 7 గంటలకే డంపింగ్ యార్డ్ను సందర్శించి మండు తున్న చెత్త కుప్పలను ఫైర్ సిబ్బందితో ఆర్పివేయిం చారు.ఈ సందర్బంగా రాజీవ్ నగర్, ఇంది రా న గర్ వాసులు కమిషనర్ను కలిసి ఏళ్ళ తరబడి చెత్త కుప్పలు మండుతూ పెద్ద ఎత్తున ఈ ప్రాంతం మొత్తాన్ని పొగ కమ్మేస్తున్నందున అనేక వ్యాధుల బారీన పడుతున్నామని ఫిర్యాదు చేశారు. మంటలు రాకుండా కొందరు సిబ్బందిని పర్యవేక్షణకు నియమిస్తామని త్వరలోనే ఇక్కడ చెత్తను డంపింగ్ చేయమని కమిషనర్ తెలిపారు