నిలకడగా గోదావరి ప్రవాహం
ABN , First Publish Date - 2020-08-02T12:26:06+05:30 IST
నిలకడగా గోదావరి ప్రవాహం
తూర్పు గోదావరి/ధవళేశ్వర: గోదావరి వరద ప్రవాహం ధవళేశ్వరం వద్ద నిలకడగా కొనసాగుతోంది. శనివారం సాయంత్రం కాటన్ బ్యారేజీ నుంచి 53,607 క్యూసెక్కుల మిగుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 10.70 అడుగులుగా నమోదైంది. వ్యవసాయ అవసరాల కోసం తూర్పు డెల్టాకు 4 వేల క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2,150 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కుల చొప్పున సాగునీటిని విడుదల చేస్తున్నారు.