- శాసనసభలో ముఖ్యమంత్రి బొమ్మై
బెంగళూరు: ఎస్టీ రిజర్వేషన్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం బసవరాజ్ బొమ్మై హామీనిచ్చారు. శాసనసభలో బుధవారం ఎస్టీ రిజర్వేషన్ పెం పును డిమాండ్ చేస్తూ సభ్యులు ఆందోళన చేయడంతో ముఖ్యమంత్రి స్పందించారు. న్యాయమూర్తుల కమిటీ నివేదిక మరో 8-10రోజులలో రానుందన్నారు. ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎస్టీ రిజర్వేషన్ అంశం అత్యంత క్లిష్టమైనదన్నారు. ప్రభుత్వం ముందు ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేవన్నారు. మాజీ ఉపలోకాయుక్త సుభాష్ అడి నేతృత్వంలో వివిధ సామాజికవర్గాల రిజర్వేషన్తోపాటు ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన కమిటీ ఏర్పడిందన్నారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు నివేదిక ఇవ్వాలని సూచించామన్నారు. రెండు వారాలలోగానే నివేదికలు రానున్నాయన్నారు. గతంలో వాల్మీకి సామాజికవర్గీయులను వెనుకబడిన, బుడకట్టు వర్గం కింద 5శాతం రిజర్వేషన్ ఉండేది. ఎస్టీలోకి వాల్మీకులను చేర్చిన తర్వాత 3.5శాతం మాత్రమే రిజర్వేషన్ సాధ్యమవుతోంది. ఇందుకోసం 7.5శాతం రిజర్వేషన్ పెంచితే న్యాయం చేసినట్టు అవుతుంద ని పలువురి డిమాండ్గా ఉందన్నారు. ఇందిరా సహాని వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ప్ర కారం 50శాతం కంటే మించి రిజర్వేషన్లు ఉండరాదనే నిబంధనలు ఉన్నా ప్రత్యేక సందర్భంలో వెసలుబాటుకు అవకాశం కోసం అడ్వకేట్ జనరల్కు నివేదిక ఇవ్వాలని సూచించామన్నారు. రిజర్వేషన్ పెంచాలని వాల్మీకి స్వామిజీలు బెంగళూరులో చేపట్టిన నిరంతర ధర్నాను విరమించుకోవాలని శాసనసభ ద్వారా కోరుతున్నట్టు తెలిపారు. ఇదే సందర్భంలో బీజేపీ సభ్యుడు రాజుగౌడ మాట్లాడుతూ సమస్యతో సతమతమవుతున్నామని జస్టిస్ నాగమోహన్దాస్ నివేదికకు అనుగుణంగా అమలు చేస్తే బాగుంటుందని సీఎంను కోరారు. 49 రోజులుగా వాల్మీకి స్వామిజీలు నిరసన తెల్పుతున్న విషయమై ముఖ్యమంత్రి నేరుగా వెళ్లి స్వామీజీలతో మాట్లాడాలని సభ్యులు కోరారు.
ఇవి కూడా చదవండి