శ్రీవారి లడ్డూ విక్రయానికి విశేష స్పందన

ABN , First Publish Date - 2020-05-26T00:43:11+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయానికి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా కేంద్రాలతో పాటు..

శ్రీవారి లడ్డూ విక్రయానికి విశేష స్పందన

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయానికి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా కేంద్రాలతో పాటు టీటీడీ కల్యాణమండపాల వద్ద లడ్డూలను విక్రయిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు లడ్డూల కోసం బారులు తీరారు. పలు జిల్లాలో ఇప్పటికే లడ్డూల విక్రయాలు పూర్తి అయ్యాయి. మంగళవారం ప్రతి జిల్లా కేంద్రానికి 30 వేల లడ్డూలను పంపించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. జిల్లా కేంద్రాలతో పాటు టీటీడీ కల్యాణ మండపాల వద్ద లడ్డూల విక్రయాలు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో లడ్డూ విక్రయాలు ప్రారంభంకాలేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి రాగానే లడ్డూలను టీటీడీ విక్రయించనుంది. 

Updated Date - 2020-05-26T00:43:11+05:30 IST