వైభవంగా శ్రీవారి కల్యాణం
ABN , First Publish Date - 2021-01-16T05:56:21+05:30 IST
డోకిపర్రు శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కోదండరామ, శ్రీనివాసుని కల్యాణమహోత్సవాలు వైభవంగా నిర్వహించారు.
గుడ్లవల్లేరు : డోకిపర్రు శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కోదండరామ, శ్రీనివాసుని కల్యాణమహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. నిర్వాహకులు పి.పి.రెడ్డి, రమ దంపతులు, కటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం పి.వి. కృష్ణారెడ్డి, నటుడు విశాల్ ఆలయ క్యాలండర్, డైరీలను ఆవిష్కరించారు. డోకిపర్రు క్షేత్రంలో జరిగిన సంక్రాతి వేడుకల్లో సినీ నటుడు విశాల్ శుక్రవారం పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.