శ్రీవరి సాగుతో అధిక దిగుబడి
ABN , First Publish Date - 2020-08-12T10:34:04+05:30 IST
శ్రీవరి సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
గార: శ్రీవరి సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. దీపావళి పంచాయతీ పరిధిలో మర్రి మల్లేశ్వరరావు అనే రైతు తన ఆరు ఎకరాల పొలంలో శ్రీవరి సాగును ప్రారంభించాడు. దీనికి సంబంధించిన నాట్లను యంత్రం ద్వారా మంగళవారం వేశారు. ఈ కార్యక్ర మంలో ఆత్మ పీడీతో పాటు ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చిన్నంనాయుడు పాల్గొని మాట్లాడారు. గాలి, వెలుతురు బాగా తగిలి మంచి దిగుబడులు వస్తాయన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎం. ఉషాకుమారి, సచివాలయ వ్యవసాయ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.
గార డీసీఎంఎస్ ఎరువుల డిపోను ఏవో ఎం.ఉషాకుమారి మంగళవారం తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సేల్స్మన్ ఆనందరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.