రూ.4 కోట్లు దాటిన శ్రీవారి హుండీ ఆదాయం
ABN , First Publish Date - 2021-03-02T08:25:28+05:30 IST
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్లు దాటింది.
తిరుమల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్లు దాటింది. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ హుండీ ఆదాయం భారీగా లభిస్తోంది. లాక్డౌన్ అనంతరం దర్శనాలు ప్రారంభించిన తర్వాత గత ఏడాది డిసెంబరు 25వ తేదీన రికార్డుస్థాయిలో రూ.4.39 కోట్లు లభించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు 55,823 మంది శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు లభించింది.