రమణీయం.. శ్రీవారి కల్యాణం

ABN , First Publish Date - 2020-10-01T18:00:18+05:30 IST

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి..

రమణీయం.. శ్రీవారి కల్యాణం

ద్వారకా తిరుమల(పశ్చిమ గోదావరి): అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు.కరోనా కారణంగా బుధవారం రాత్రి ఏకాంతంగానే స్వామివారి కల్యాణాన్ని ఆలయ ప్రధానార్చకులు పెద్దింటి రాంబాబు, అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో కడు రమణీయంగా నిర్వహించారు. ముం దుగా స్వామి, అమ్మవార్లను రజిత సింహాసనంపై ఆశీనులు గావింపజేసి ప్రత్యేక పూజలు జరిపి హారతులు ఇచ్చారు. అనం తరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాల ను నిర్వహించి కల్యాణతంతును ప్రారంభించారు.స్వామి, అమ్మ వార్లకు పట్టు వస్త్రాలను దేవస్థాన అధికారులు సమర్పించారు.


అనంతరం యజ్ఞోపవీతం, రక్షాబంధనం, శుభముహుర్తాన స్వామి, అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం పెట్టి కల్యా ణాన్ని వైభవంగా నిర్వహించారు. తదుపరి మాంగళ్యధారణ, తలంబ్రాలను వేదపండితులు నిర్వహించారు. ఏటా స్వామి వారికి ఆశ్వీయుజ, వైశాఖ మాసాల్లో తిరుకల్యాణ మహోత్స వాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది అధిక ఆశ్వీయుజ మాసం రావడంతో స్వామి వారికి మూడు కల్యాణాలు జరిగినా ప్రత్య క్షంగా పాల్గొనే భాగ్యం కలగనప్పటికీ.. యూట్యూబ్‌ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించారు.


Updated Date - 2020-10-01T18:00:18+05:30 IST