AP: శ్రీశైల దేవస్థానం పడితరం స్టోర్ సూపరింటెండెంట్ సస్పెండ్
ABN , First Publish Date - 2022-01-10T15:46:02+05:30 IST
శ్రీశైల దేవస్థానం పడితరం స్టోర్ సూపరింటెండెంట్ ఉమేష్పై సస్పెన్షన్ వేటు పడింది.
కర్నూలు: శ్రీశైల దేవస్థానం పడితరం స్టోర్ సూపరింటెండెంట్ ఉమేష్పై సస్పెన్షన్ వేటు పడింది. పడితరం స్టోర్ మెయింటెనెన్స్ రిజిస్టర్లో లోపాలు ఉన్నట్టు ఈఓ లవన్న గుర్తించారు. ఈ క్రమంలో సూపరింటెండెంట్ను సస్పెండ్ చేస్తూ ఈఓ ఆదేశాలు జారీ చేశారు. పడితరం అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల మురళికృష్ణను విచారణ అధికారిగా నియమించారు. సస్పెండ్ సమయంలో హెడ్ క్వాటర్ దాటి వెళ్ళరాదని ఈఓ లవన్న ఆదేశాలు జారిచేశారు.