AP: శ్రీశైలం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-11-08T13:30:52+05:30 IST

శ్రీశైలం ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.

AP: శ్రీశైలం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

కర్నూలు: శ్రీశైలం ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో స్వామివారి దర్శనానికి  4 గంటల సమయం పడుతోంది. ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామస్మరణతో  శ్రీశైలం మారుమ్రోగుతోంది. గంగాధర మండపం వద్ద మహిళా భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. భక్తి శ్రద్ధలతో శ్రీశైలంలోని పాతాళగంగలో భక్తులు కార్తీక పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. గంగమ్మ ఒడిలో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కలు తీర్చుకుంటున్నారు.  

Updated Date - 2021-11-08T13:30:52+05:30 IST