శ్రీశైలంలో భ్రమరాంబాదేవికి శాకాంబరి ఉత్సవం
ABN , First Publish Date - 2020-07-05T14:07:47+05:30 IST
శ్రీశైలంలో భ్రమరాంబాదేవికి శాకాంబరి ఉత్సవం
కర్నూలు: ఆషాడ పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబాదేవికి శాకాంబరి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో శ్రీశైలం దేవస్థానం సిబ్బంది అలంకరించింది. శాకాంబరి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు.