శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 5,62,850 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-10-17T13:53:46+05:30 IST

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది.

శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో  5,62,850 క్యూసెక్కులు

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో  5,62,850 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లను 25 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అవుట్ ఫ్లో 5 లక్షల 94 వేల 042 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ 211.9572 టీఎంసీలుగా నమోదు అయ్యింది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2020-10-17T13:53:46+05:30 IST