శ్రీశైలం జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం
ABN , First Publish Date - 2021-04-17T16:01:43+05:30 IST
శ్రీశైలం జలాశయంలో తగ్గతున్న నీటిమట్టం కనిష్ఠస్థాయికి చేరుకుంటోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 807.80 టీఎంసీలుగా ఉంది
కర్నూలు : శ్రీశైలం జలాశయంలో తగ్గతున్న నీటిమట్టం కనిష్ఠస్థాయికి చేరుకుంటోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 807.80 టీఎంసీలుగా ఉంది. జలాశయంలోని నీటిని రెండు రాష్ట్రాలు విద్యుత్పత్తికి వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో రోజురోజుకు నీటి సామర్థ్యం తగ్గుముఖం పడుతోంది. శ్రీశైలం కుడిగట్టు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 33 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.