Srisailam temple: ప్రోటోకాల్ దర్శనాల్లో మార్పులు

ABN , First Publish Date - 2022-09-03T14:32:35+05:30 IST

ఈనెల 5 నుండి శ్రీశైలంలో సామాన్య భక్తుల దర్శనం దృష్ట్యా ప్రోటోకాల్ దర్శనాల్లో మార్పులు చోటు చేసుకున్నారు.

Srisailam temple: ప్రోటోకాల్ దర్శనాల్లో మార్పులు

నంద్యాల: ఈనెల 5 నుండి శ్రీశైలం (Srisailam temple)లో సామాన్య భక్తుల దర్శనం దృష్ట్యా ప్రోటోకాల్ (protocoll) దర్శనాల్లో మార్పులు చోటు చేసుకున్నారు. ఈనెల 5 నుండి రోజులో రెండు సార్లు మాత్రమే ప్రముఖులకు దర్శనాలు చేసుకునేందుకు దేవస్థానం ఏర్పాటు చేసింది. ఉదయం 5:30 నుండి 6:15 గంటలకు,  సాయంత్రం 7 గంటల నుంచి 7:30 గంటల వరకు మాత్రమే ప్రముఖులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఆలయానికి విచ్చేసే ప్రముఖులు తమ పర్యటన రెండు రోజులు ముందు తెలుపాలని దేవస్థానం కోరింది. ప్రముఖుల దర్శన, ఆర్జితసేవ, సిఫారసు ఎస్.ఎం.ఎస్ పంపడాన్ని  దేవస్థానం రద్దు చేసింది. వసతి, దర్శన, ఆర్జితసేవ సిఫారసులకు ప్రముఖుల లెటర్ హెడ్ ఇవ్వాలని ఈవో లవన్న పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-03T14:32:35+05:30 IST