శ్రీశైలం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-01-01T15:57:54+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్ర శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలనికి భక్తుల రద్దీ పెరిగింది.
కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్ర శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలనికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు. మల్లికార్జునస్వామి వారి దర్శనానికి నాలుగు గంటలు సమయం పడుతోంది. ఈరోజు వేకువజామున నాలుగు గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్వామివారి స్పర్శ దర్శనాలను దేవస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేసింది.