శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

ABN , First Publish Date - 2021-03-08T05:11:49+05:30 IST

నల్లమల అటవీ ప్రాం తంలో శ్రీశైలం - దోర్నాల ఘాట్‌రోడ్డులో గుర్తు తెలియని వాహనం తగలడంతో ఆటోలో ప్రయాణిస్తున్న బాలిక మృతి చెందింది.

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

ఆటోను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. బాలిక మృతి

పెద్దదోర్నాల, మార్చి 7 : నల్లమల అటవీ ప్రాం తంలో శ్రీశైలం - దోర్నాల ఘాట్‌రోడ్డులో గుర్తు తెలియని వాహనం తగలడంతో ఆటోలో ప్రయాణిస్తున్న బాలిక మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని చింతల వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన షికారి గాన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం దైవదర్శనానంతరం తిరిగి స్వగ్రామం వెళ్తున్నారు. డ్రైవర్‌ వెనుక భాగాన కూర్చున్న అతని పెద్దకుమార్తె దివ్య(15) ఆటో నుంచి తల బయటకు పెట్టడంతో చింతల వద్దకు రాగానే దోర్నాల వైపు నుంచి శ్రీశైలం వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వేగంగా దివ్య తలను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.  ఈ హఠాత్తు పరిణామానికి ఆటో కూడా పక్కకు దూసుకెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న దివ్య చెల్లెలు మం జులకు స్వల్ప గాయాలయ్యాయి. మంజులను వెంటనే దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-08T05:11:49+05:30 IST