శ్రీశైలానికి భారీగా వరద
ABN , First Publish Date - 2020-10-18T09:12:55+05:30 IST
శ్రీశైలానికి భారీగా వరద
కర్నూలు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం డ్యాంకు వరద భారీగా పెరిగింది. జూరాల ప్రాజెక్టు స్పిల్వే నుంచి 4,65,432 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 28,952, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తోంది. శనివారం 5,98,775 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో పది గేట్లను 25 అడుగుల మేర ఎత్తి 5,67,860 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి మరో 22,227 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.40 అడుగులు ఉంది. నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, 211.9572 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.