వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
ABN , First Publish Date - 2021-04-23T05:28:10+05:30 IST
సంజీవనగర్లోని భగవత్ సేవా సమాజ్ ప్రాంగణంలోని కోదండరామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు.
నంద్యాల(కల్చరల్), ఏప్రిల్ 22: సంజీవనగర్లోని భగవత్ సేవా సమాజ్ ప్రాంగణంలోని కోదండరామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. గత 13వ తేదీ నుంచి వసంత నవరాత్రుతోత్సవాలు గురువారం పట్టాభిషేకంతో ముగిశాయి. భగవత్ సేవాసమాజ్ కమిటీ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య ఆధ్వర్యంలో అర్చకులు ప్రహ్లాద స్వామి, పవన్, ధనుంజయలు స్వామి పట్టాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.