స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
ABN , First Publish Date - 2021-01-27T06:19:32+05:30 IST
రాష్ట్రంలో అరాచక, రాక్షసపాలన సాగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి బీటలు వారేలా స్థానిక ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు పార్టీ విజయానికి కృషి చేయాలని తెలుగుదేశం జాతీయ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ పిలుపునిచ్చారు.
శ్రీరాం తాతయ్య, నెట్టెం రఘరామ్ పిలుపు
పెనుగంచిప్రోలు, జనవరి 26: రాష్ట్రంలో అరాచక, రాక్షసపాలన సాగిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి బీటలు వారేలా స్థానిక ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు పార్టీ విజయానికి కృషి చేయాలని తెలుగుదేశం జాతీయ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ పిలుపునిచ్చారు. మంగళవారం పెనుగంచిప్రోలులో తంబరేణి ఫంక్షన్హాలులో జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేయటం, కోర్టులను ధిక్కరించటం, ఆరాచకాన్ని ప్రోత్సహించే చర్యలతో 20 నెలల కాలంలో ప్రజల్లో అశాంతిని రేకేత్తించిన జగన్ ప్రభుత్వానికి గట్టిబుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో ముందుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. జిల్లా తెలుగు మహిళ మాజీ అధ్యక్షురాలు ఆచంట సునీత, నియోజకవర్గ తెలుగుమహిళ అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మీ, పార్టీ మండల అధ్యక్షుడు కట్టా నరసింహారావు, వడ్లమూడి రాంబాబు, వి. గోపాలకృష్ణమూర్తి, మల్లెల గాంధీ, గింజుపల్లి రమేష్, గజ్జి కృష్ణమూర్తి, మన్నె కళావతి, పీ.బాబురావు, జి.శివనాయక్ పాల్గొన్నారు.